కాన్పు కోసం ఏపీలోని గుంటూరు ఆసుపత్రిలో చేరిన గర్భిణీ అరుదైన గ్రూపు కావడంతో రక్తం కోసం రెండు వారాలుగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న హైదరాబాద్కు చెందిన వ్యక్తి నేనున్నానంటూ ముందుకొచ్చి రక్తదానం చేసి మానవత్వం చాటారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, చేకూరుకు చెందిన కిరణ్, కృష్ణలతది వ్యవసాయ కుటుంబం. ఆమె నిండు గర్భిణీ. రెండు వారాల క్రితం గుంటూరులోని ప్రభుత్వ ఆసుత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి ఆమెకు రక్తం తక్కువగా ఉందని చెప్పారు. ఆమె గ్రూపు అరుదైనది. బాంబే ఫెనోటైప్ రక్తం. రక్తం ఎక్కిస్తేనే ఈ నెల 23న సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారు. అంతా లాక్డౌన్. ఎక్కడా తిరిగే పరిస్థితి లేదు. ఎవరినీ అడిగినా ఇదేమీ కొత్త రక్తం అంటున్నారు. ఏ రక్తనిధి కేంద్రాలను సంప్రదించినా ఫలితం లేదు. ఎక్కడ తిరిగినా ఫలితం లేకపోవడంతో వారు ఇచ్చిన సర్జరీ గడువు కూడా దాటిపోయింది.