తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2020, 1:04 PM IST

Updated : Nov 24, 2020, 4:20 PM IST

ETV Bharat / city

కేసీ రావు, కేటీ రావు.. తెలంగాణకు ఏమీ రావు: తేజస్వీ సూర్య

తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని బీజేవైఎం జాతీయాధ్యక్షుడు తేజస్వీ సూర్య విమర్శించారు. సీఎం కేసీఆర్​ ప్రజాస్వామ్య నిర్వచనాన్నే మార్చేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో బంగారమంతా తెరాస నేతల జేబుల్లోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు.

bjym national president tejaswi surya fire on cm kcr family politics
కేసీ రావు, కేటీ రావు.. తెలంగాణకు ఏమీ రావు: తేజస్వీ సూర్య

కేసీ రావు, కేటీ రావు కుటుంబ పాలనలో... ప్రజలకు ఏమీ రావు అని కర్ణాటక ఎంపీ, భాజపా యువమోర్చా జాతీయాధ్యక్షుడు తేజస్వీ సూర్య ఎద్దేవా చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఉస్మానియా ఆర్ట్స్​ కళాశాల వద్ద ప్రసంగించారు. ఉద్యోగాల కోసం కొట్లాడిన యువత... ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసికట్టుగా తెరాసకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీ రావు, కేటీ రావు.. తెలంగాణకు ఏమీ రావు: తేజస్వీ సూర్య

తెలంగాణలో సీఎం కేసీఆర్​ ప్రజాస్వామ్య నిర్వచనాన్నే మార్చేశారని తేజస్వీ విమర్శించారు. తెరాస చేస్తామన్న బంగారు తెలంగాణలో... బంగారమంతా ఆ పార్టీ నేతల జోబుల్లోకే వెళ్లిందని మండిపడ్డారు. హైదరాబాద్​లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన సూచించారు. అమరవీరు స్థూపానికి నివాళులు అర్పించేందుకు వస్తే... పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు సీఎం కనుసైగల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి:కరోనాపై సమీక్ష: సీఎంలతో ప్రధాని మోదీ భేటీ

Last Updated : Nov 24, 2020, 4:20 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details