ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే పేద ప్రజలకు అందజేయాలని భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కూకట్పల్లి జోనల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేశారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ భాజపా ధర్నా - హైదరాబాద్ వార్తలు
హైదరాబాద్ కూకట్పల్లి జోనల్ కార్యాలయం ముందు భాజపా నేతలు ఆందోళన చేశారు. ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. రెండు పడక గదుల ఇళ్లను త్వరితగతిన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
![ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ భాజపా ధర్నా bjp leaders protest against lrs act in kukatpally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8981983-351-8981983-1601374914157.jpg)
bjp leaders protest against lrs act in kukatpally
ఎల్ఆర్ఎస్ వల్ల మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు కాంతారావు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.