తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 7:53 PM IST

Updated : Oct 30, 2019, 8:09 PM IST

ETV Bharat / city

కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదు: లక్ష్మణ్

ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కార్మికులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. ఆర్టీసీపై కేంద్రాన్ని కలుస్తామని తెలిపారు.

హైకోర్టు.. చినజీయర్​ అక్షింతలు ఒకటేనా..:లక్ష్మణ్​

హైకోర్టు.. చినజీయర్​ అక్షింతలు ఒకటేనా..:లక్ష్మణ్​

ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసే ప్రకటనలు ఆర్టీసీ కార్మికులపై కొంచెం ప్రభావం కూడా చేయలేకపోయాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హైకోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోవడం లేదన్నారు. చినజీయర్​ స్వామి అక్షింతలు.. హైకోర్టు అక్షింతలు ఒకటేనని కేసీఆర్​ భావిస్తున్నారని లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిందని.. ఈ అంశంపై కేంద్రాన్ని కలుస్తామని తెలిపారు.

Last Updated : Oct 30, 2019, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details