తెలంగాణ

telangana

ETV Bharat / city

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భాజపా అభ్యర్థుల ప్రకటన

By

Published : Feb 15, 2021, 12:34 PM IST

Updated : Feb 15, 2021, 4:49 PM IST

BJP Announce Graduate MLC elections Candidates
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భాజపా అభ్యర్థుల ప్రకటన

12:32 February 15

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భాజపా అభ్యర్థుల ప్రకటన

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భాజపా తన అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావుకే మరోసారి అవకాశం ఇచ్చింది. వరంగల్-నల్గొండ-ఖమ్మం అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని బరిలో నిలిపింది.  

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ ధీమావ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వారు ఆగ్రహంగా ఉన్నారని సంజయ్​ అన్నారు. మోదీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 

శాసనమండలి ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రెండు పట్టభద్రుల స్థానాల్లో నోటిఫికేషన్ జారీతో.. నామినేషన్లు స్వీకరిస్తారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌ నియోజకవర్గానికి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గానికి నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఆయా కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంటుంది. 

ఇవీచూడండి:రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ

Last Updated : Feb 15, 2021, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details