హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లో డిసెంబరు 8న రూ.కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను బిహారీ ముఠా దొంగిలించింది. చోరీ చేశాక ముఠా సభ్యులు బిహార్లోని మధుబని ప్రాంతానికి పారిపోయారు. బంగారు నగలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. వజ్రాల నగలు మాత్రం మూటగట్టి ఓ ఇంట్లోని పశువుల కొట్టంలోని భూమిలో పాతిపెట్టారు. మరికొంత గోడలో దాచిపెట్టారు.
వజ్రాలను గోడల్లో దాచారు... కొట్టంలో పాతారు
బంజారాహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లో ఇటీవల చోటుచేసుకున్న చోరీలో బిహారీ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారు ఆ సొమ్మును దాచిపెట్టిన ప్రాంతాన్ని చూసి పోలీసులే ఖంగుతిన్నారు.
గోడల్లో దాచారు కొట్టంలో పాతారు
ఆరుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేసిన పోలీసుల బృందం సొత్తును చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ బుధవారం హైదరాబాద్లో వెల్లడించారు.
పూర్తి సమాచారం:పనివాళ్లుగా చేరారు... ఇళ్లను కొల్లగొట్టారు...