రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ఎప్పుడూ తానూ భయపడలేదని భవాని రెడ్డి పేర్కొన్నారు. ఇప్పడు నాకు కొత్తగా అడిగిన వెంటనే ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆమె ధన్యవాదాలు చెప్పారు. అధికార తెరాస పార్టీకి చుక్కలు చూపిద్దామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యురాలిగా కలగలుపుకుని పనిచేసి తెరాసను దీటుగా ఎదుర్కొంటానని కాంగ్రెస్ పార్టీలో చేరిన భవాని రెడ్డి తెలిపారు.
ఇవాళ సిద్దిపేటకు చెందిన తెలంగాణ రాష్ట్ర జన సమితి నాయకురాలు, మరో పది మంది ఆమె అనుచరులకు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విద్యావంతురాలు భవాని రెడ్డికి కాంగ్రెస్ అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.