తెలంగాణ

telangana

తెరాసకు మద్దతుపై సీపీఐ పునరాలోచించాలి: భట్టి

By

Published : Oct 7, 2019, 3:35 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల డిమాండ్​ న్యాయమైనదేని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. 48 వేల మంది కార్మికులను తొలగిస్తునట్లు ప్రకటించడం నియంతృత్వమేనని పేర్కొన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమనడం న్యాయమైనదే: భట్టి

దసరా సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు గత ప్రభుత్వాలు బోనస్ ఇచ్చేవని.. కేసీఆర్‌ మాత్రం ఉద్యోగాలు తొలగిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 48వేల మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం నియంతృత్వమేనని మండిపడ్డారు. దేశ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మొదటిసారిగా పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలనే.. నెరవేర్చాలనే కార్మికులు కోరుతున్నట్లు భట్టి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరడం న్యాయమైనదేనని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. కార్మికుల పక్షపాతిగా చెప్పుకునే సీపీఐ.. హుజూర్​నగర్‌ ఉపఎన్నిక సందర్భంగా ఇచ్చిన మద్దతుపై పునరాలోచించాలని సూచించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమనడం న్యాయమైనదే: భట్టి

ABOUT THE AUTHOR

...view details