తెలంగాణ

telangana

ETV Bharat / city

పెన్సిల్ మొనపై అందమైన ఆకృతులు

అంతర్జాతీయ యోగా, సంగీత, పితృ దినోత్సవం సందర్భంగా తనలోకి సూక్ష్మ కళను ప్రదర్శించాడు ఓ కళాకారుడు. పెన్సిళ్లపై అందమైన ఆకృతులు రూపొందించి అందరీ ప్రశసంలు పొందుతున్నాడు.

By

Published : Jun 21, 2020, 12:23 PM IST

beautiful-micro-arts-made-on-pencil-tips
పెన్సిల్ మొనపై అందమైన ఆకృతులు

అంతర్జాతీయ పితృ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా పెన్సిల్​ మొనపై సూక్ష్మ కళను ప్రదర్శించాడు ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా రాజీవ్ కాలనీకి చెందిన కళాకారుడు రాజేష్. తండ్రి ప్రేమకు గుర్తుగా తండ్రి వేలు పట్టుకుని ఉన్న చిన్నారి బొమ్మను, నాలుగు రకాల ఆసనాలను, గజ్జెలు కట్టిన పాదాన్ని 3 పెన్సిల్ల మొనలపై చెక్కాడు.

ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలని, ఆరోగ్యం కోసం నిత్యం యోగా చేయాలని, నృత్యం ఇష్టమున్నవారు నృత్య కళలో రాణించాలని ఆశిస్తూ వీటిని రూపొందించినట్లు రాజేశ్ తెలిపాడు. ఈ కళాకృతులను కాలనీవాసులు, చిన్నారులు ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చదవండి:డిజిటల్ ప్లాట్​ఫాంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు

ABOUT THE AUTHOR

...view details