తెలంగాణ

telangana

ETV Bharat / city

'క్షేత్రస్థాయి అంశాలపై అసెంబ్లీలో ఎండగడతాం...'

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలన్న అంశంపై పీసీసీ అధికార ప్రతినిధులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి అంశాలను తీసుకుని అసెంబ్లీలో ఎండగట్టాలని కాంగ్రెస్​ నేతలు నిర్ణయించుకున్నారు.

By

Published : Sep 11, 2019, 10:09 PM IST

BATTI VIKRAMARKA MEET SPOKE PERSONS IN GANDHIBHAVAN

హైదరాబాద్​ గాంధీభవన్​లో పీసీసీ అధికార ప్రతినిధులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కార్యాచరణపై నేతలతో సమీక్షించారు. తెరాస ఇచ్చిన హామీలు, అమలుపై శాఖలవారీగా లోతుగా పరిశీలించాల్సిన అవసరముందని భట్టి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి అంశాలను గణాంకాల ఆధారంగా అసెంబ్లీలో ఎండగట్టాలని నిర్ణయించారు. ఆర్థికమాంద్యం పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వం మోసం చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details