తెలంగాణ

telangana

ETV Bharat / city

బేగంపేటలో పీవీ సింధుకు ఘన స్వాగతం

దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పీవీ సింధు, కోచ్ గోపిచంద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. సింధుకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఘన స్వాగతం పలికారు.

By

Published : Aug 27, 2019, 9:08 PM IST

Updated : Aug 27, 2019, 11:22 PM IST

pv sindhu

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్​లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్​లోని బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. పీవీ సింధుకు క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడా సాధికారత సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు, చాముండీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సింధు గచ్చిబౌలీలోని గోపిచంద్ అకాడమీకి వెళ్లారు. పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు ప్రముఖులు రావడం వల్ల పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు.

బేగంపేటలో పీవీ సింధుకు ఘన స్వాగతం
Last Updated : Aug 27, 2019, 11:22 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details