తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2020, 12:20 PM IST

Updated : Nov 21, 2020, 5:08 PM IST

ETV Bharat / city

బీ-ఫారాలు అందించేందుకు రేపటివరకు గడువు

గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు బీ-ఫారం సమర్పించేందుకు రేపటి వరకు గడువు ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు.​ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

State Election Commission Commissioner Parthasarathy
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఎన్నికకు నామనేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. పార్టీల తరఫున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల బీఫారం సమర్పించేందుకు రేపటి వరకు గడువు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. రేపు నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని.... ఆ సమయంలోపు బీఫారాన్ని సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించాలన్నారు.

నామినేషన్లు ముగిసినందున నిన్నటి వరకే ఏ-ఫారం అందించే గడువు ముగిసింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

Last Updated : Nov 21, 2020, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details