తెలంగాణ

telangana

ETV Bharat / city

సహజీవనానికి ఒప్పుకోలేదని... పీక కోశాడు!

విజయవాడలోని మొగల్రాజపురంలో మహిళపై ఓ ఆగంతుకుడు కత్తితో దాడి చేశాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

By

Published : Sep 6, 2019, 12:38 AM IST

Updated : Sep 6, 2019, 1:59 AM IST

సహజీవనానికి ఒప్పుకోలోదని... పీక కోశాడు!

కోరిక తీర్చలేదన్న కోపంతో ఒక ఆగంతుకుడు... మహిళపై దాడి చేసి గొంతు కోశాడు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్రాజపురంలో ఈ ఘటన జరిగింది. ఇళ్లలో పని చేసుకుంటూ ఉన్న ఓ మహిళను... అదే ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి సహజీవనం చేయాలని వేధించాడు. తనకు పిల్లలు ఉన్నారని, తాను ఒప్పుకోనని ఆ మహిళ తెగేసి చెప్పింది. కక్ష పెంచుకున్న నాగేశ్వరరావు... ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. గురువారం సాయంత్రం పని చేసి ఇంటికి వెళ్తున్న మహిళపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. తలను పట్టుకొని కత్తితో పీక కోశాడు. బాధితురాలు గట్టిగా అరవగా... సమీపంలోని వారు వచ్చి నిందితున్ని అడ్డుకున్నారు. అప్పటికే మెడపై గాయంతో తీవ్ర రక్తస్రావం జరిగి మహిళ రోడ్డుపై కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సహజీవనానికి ఒప్పుకోలోదని... పీక కోశాడు!
Last Updated : Sep 6, 2019, 1:59 AM IST

ABOUT THE AUTHOR

...view details