గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం జరగనున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయుధ బలగాల గౌరవవందనం స్వీకరిస్తారు.
గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు పూర్తి.. ఎట్హోం కార్యక్రమం రద్దు - తెలంగాణలో ఎట్హోం కార్యక్రమం రద్దు
గణతంత్ర వేడుకకు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ ముస్తాబైంది. తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.
![గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు పూర్తి.. ఎట్హోం కార్యక్రమం రద్దు republic day in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10378267-578-10378267-1611593183261.jpg)
గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు పూర్తి.. ఎట్హోం కార్యక్రమం రద్దు
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కరోనా నేపథ్యంలో అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమాన్ని జరపడం లేదు.
ఇవీచూడండి:'సంస్కరణలపై అనుమానాలు సహజం- రైతు సంక్షేమమే ధ్యేయం'
Last Updated : Jan 26, 2021, 12:02 AM IST