తెలంగాణ

telangana

ETV Bharat / city

APSRTC CHARGES HIKE: ఆర్టీసీ ఛార్జీల మోత... పెరిగిన డీజిల్ సెస్సు - aps rtc diesel cess

డీజిల్ సెస్సు, సేఫ్టీ సెస్సు పేరిట ప్రయాణికులపై ఏపీఎస్​ ఆర్టీసీ భారం మోపింది. పల్లెవెలుగు బస్సుల్లో 2 రూపాయలు, ఎక్సప్రెస్సుల్లో 5 రూపాయలు, ఏసీ బస్సుల్లో 10 రూపాయల చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. వీటికి అదనంగా అన్నింటిపైనా రూపాయి చొప్పున సేఫ్టీ సెస్సు విధించింది.

aps rtc
aps rtc

By

Published : Apr 13, 2022, 4:46 PM IST

APSRTC CHARGES HIKE: డీజిల్ సెస్‌ పేరుతో ఏపీఎస్​ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో టికెట్‌పై రూ.2, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.5, దూరప్రాంత బస్సులకు రూ.10 పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. పల్లెవెలుగు, సిటీ బస్సుల్లో ఇకనుంచి కనీస ఛార్జీ రూ.10గా నిర్ణయించామన్నారు. పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సెస్‌లు, రౌండ్‌ఆఫ్‌తో పల్లెవెలుగు బస్సుల్లో టికెట్‌ కనిష్ఠ ధర రూ.15గా ఉండనుందన్నారు. డీజిల్‌ సెస్‌ వల్ల ఆర్టీసీకి ఏటా రూ.720 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.

"ఆర్టీసీకి రెండేళ్లుగా ఆర్థిక కష్టాలు పెరిగాయి. డీజిల్ ధర రెండేళ్లలో రూ.67 నుంచి రూ.107కు చేరింది. బల్క్ ధర ఎక్కువగా ఉందని రీటైల్‌గా తీసుకుంటున్నాం. కరోనా వల్ల ఆర్టీసీకి 5,680 కోట్ల ఆదాయం తగ్గింది. ఆర్టీసీలో ప్రస్తుతం నిర్వహణ కూడా కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ విధిస్తున్నాం. ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తాం. కార్గో సేవల ద్వారా కూడా ఆదాయం పెంచుకుంటాం. ఆర్టీసీ.. రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది.పెట్రో ధరలు, టైర్లు, ఇతర పరికరాల ధరలు కూడా బాగా పెరిగాయి." -ద్వారకా తిరుమల రావు, ఏపీఎస్​ ఆర్టీసీ ఎండీ

ఇదీ చదవండి:తెలంగాణ ఆడపడుచే.. ఆంధ్ర ఆరోగ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details