తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2022, 5:30 PM IST

ETV Bharat / city

APSRTC Special Buses: ఈ నెల 8 నుంచి ఏపీఎస్​ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... 50శాతం అదనపు ఛార్జీలు!

APSRTC Special Buses: ఈ నెల 8 నుంచి 17 వరకు ఏపీఎస్​ఆర్టీసీ... ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను ఆర్టీసీ వసూలు చేయనుంది. హైదరాబాద్​ సహా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు ఈ సర్వీసులు నడపనున్నారు.

APSRTC Special Buses
APSRTC Special Buses

APSRTC Special Buses: సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలకు 6,970 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈనెల 8 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. పండగ ముందు 4,145 బస్సులు, తర్వాత తిరుగు ప్రయాణానికి 2,825 ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్​కు రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన అధికారులు.. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి 2,500 బస్సులు ఏర్పాటు చేశారు. పండగ ముందు, తర్వాత రోజుల్లో ఈ బస్సులు నడవనున్నాయి. చెన్నై కి 120, బెంగళూరు 300, విజయవాడకు 600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి 850 బస్సులు, ఇతర ప్రాంతాలకు 2,600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రధాన పట్టణాలకు ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు.

ఇదీచూడండి:బయటకు రావడానికే జనం భయపడుతుంటే..ఎగ్జిబిషన్ కావాలా?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details