తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ ఎస్​ఈసీ, సీఎస్ మధ్య లేఖల పరంపర - ఏపీ స్థానిక ఎన్నికలు వార్తలు

ఏపీ ఎస్​ఈసీ, సీఎస్ మధ్య లేఖల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ నీలం సాహ్నికి మరో లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని ఎస్​ఈసీ లేఖతో జత చేశారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం సహకారం తప్పనిసరి అని కోర్టు చెప్పిన విషయాన్ని నిమ్మగడ్డ సీఎస్​కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఏపీ ఎస్​ఈసీ, సీఎస్ మధ్య లేఖల పరంపర
ఏపీ ఎస్​ఈసీ, సీఎస్ మధ్య లేఖల పరంపర

By

Published : Nov 23, 2020, 10:38 PM IST

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరోసారి లేఖ రాశారు. ఎస్‌ఈసీకి ప్రభుత్వం సహకరించాలన్న హైకోర్టు తీర్పు కాపీని కమిషనర్ లేఖతో జత చేశారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కాపీ ఇవాళ విడుదలైంది. ఆ తీర్పులో రాజ్యాంగ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని కోర్టు తెలిపింది. ప్రభుత్వ సహకారంపై మళ్లీ నివేదిక ఇవ్వాలని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయాన్నే ఎస్​ఈసీ... సీఎస్​కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details