తెలంగాణ

telangana

ఆర్డీఎస్​ కాలువ పనులు నిలిపి వేస్తున్నట్లు ఏపీ లేఖ

AP letter to KRMB: రాజోలిబండ డైవర్షన్​ స్కీ కుడి కాలువ నిర్మాణం, అందుకు సంబంధించిన పనులను నిలిపివేశామని కేఆర్​ఎమ్​బీకి ఏపీ ఈఎన్​సీ లేఖ రాసింది. అందుకు తగిన ప్రతిని కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు తెలంగాణకు పంపింది.

By

Published : Sep 16, 2022, 9:30 AM IST

Published : Sep 16, 2022, 9:30 AM IST

krmb
కేఆర్​ఎమ్​బీ

AP letter to KRMB: ఏపీ ఈఎన్​సీ తెలిపిన ఆర్డీఎస్ వ్యవహారంలో తెలంగాణకు కేఆర్​ఎమ్​బీ లేఖ రాసింది. రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్) కుడి ప్రధాన కాల్వ నిర్మాణం, అందుకు సంబంధించిన కాంపోనెంట్ల పనులు చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించినట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. ఆర్డీఎస్ కుడి ప్రధాన కాల్వ పనుల స్థితిపై తెలంగాణ ఈఎన్​సీకి కేఆర్ఎంబీ లేఖ పంపింది.

కుడి ప్రధాన కాల్వ పనుల (ఆర్డీఎస్) స్థితి గురించి బోర్డు తెలుసుకుందని, కాల్వ నిర్మాణం సహా సంబంధిత పనులు చేపట్టలేదని ఏపీ ఈఎన్​సీ నివేదించినట్లు పేర్కొంది. రాజోలిబండ ఆనికట్ కుడివైపు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పాక్షికంగా పూర్తయినట్లుగా ఏపీ చెప్పినట్లు బోర్డు తెలిపింది. తదుపరి నిర్మాణాన్ని చాలా రోజుల క్రితమే నిలిపివేసినట్లు వివరించిందని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. ఏపీ ఈఎన్​సీ రాసిన లేఖ ప్రతిని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణకు పంపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details