తెలంగాణ

telangana

డా.అనితారాణి పిటిషన్​పై కౌంటర్ దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశం

వైద్యురాలు అనితారాణి కేసులో ఏపీ ప్రభుత్వంతో పాటు సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

By

Published : Jun 22, 2020, 7:08 PM IST

Published : Jun 22, 2020, 7:08 PM IST

ap high court
ap high court

చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వంతో పాటు సీఐడీని కోర్టు ఆదేశించింది. సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్​ కోరారు.

తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. చిత్తూరు జిల్లా పెనుమూరు ఆస్పత్రిలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని వైద్యురాలు అనితారాణి ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి : గూగుల్​ పే కస్టమర్​ కేర్​ పేరుతో మోసం

ABOUT THE AUTHOR

...view details