తెలంగాణ

telangana

By

Published : Feb 12, 2022, 10:44 PM IST

ETV Bharat / city

హైకోర్టు జడ్జిల నియామక నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

హైకోర్టు జడ్జిల నియామక నోటిఫికేషన్​ను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. కొత్త జడ్జిలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు.

High Court Judges has been issued by the State Government
High Court Judges has been issued by the State Government

హైకోర్టు జడ్జిల నియామక నోటిఫికేషన్​ను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రిపబ్లిష్‌ చేసింది. కొలిజీయం సిపారసు మేరకు హైకోర్టు జడ్జిలుగా కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత నియమితులైన సంగతి తెలిసిందే.

కొత్త జడ్జిలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత సీనియారిటీ మేరకు కొత్త జడ్జిలకు బాధ్యతలు అప్పగించనున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details