Pension in AP : ఏపీలో 2018 జులై 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి.. పెన్షన్ మొత్తంలో కోత పడకుండా ఆ రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంది. వారికి సీఎఫ్ఎమ్ఎస్ లోనే కొత్త మూల పెన్షన్ నిర్ధారించి.. ఆ మొత్తంపై కొత్త కరవు భత్యం లెక్కించి ఎంత చెల్లించాలో ఖరారు చేసింది. ఇందుకు అనుగుణంగా సీఎఫ్ఎమ్ఎస్లో ప్రోగ్రాం ద్వారా మార్పులు చేసి కొత్త పెన్షన్ బిల్లులు సిద్ధం చేసింది. కొత్త మూల పెన్షన్ నిర్ణయించకుండా అంతకుముందు నెలలో ఇచ్చిన మధ్యంతర భృతిని కూడా తొలగించి తొలుత పెన్షన్ బిల్లులు సిద్ధం చేశారు. ఆ స్లిప్పులు చూసిన పింఛనుదార్లు వచ్చే పెన్షన్లో కోతపడటంతో ఆందోళన చెందారు.
Pension in AP : పింఛను కోత పడకుండా ఏపీ సర్కారు చర్యలు - ఏపీలో పింఛను సమస్య
Pension in AP : పెన్షన్ కోతపడకుండా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. పింఛనుదారులకు సీఎఫ్ఎమ్ఎస్ లోనే కొత్త మూల పెన్షన్ నిర్ధారించే మొత్తంపై కొత్త కరవు భత్యం లెక్కించి ఎంత చెల్లించాలో ఖరారు చేసింది.
![Pension in AP : పింఛను కోత పడకుండా ఏపీ సర్కారు చర్యలు Pension in AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14326514-954-14326514-1643592775526.jpg)
Pension Issue in AP : ఈ విషయంపై సవరణ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఇతర నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు. కొత్త పెన్షన్ స్థిరీకరించే వరకు డిసెంబర్లో ఇచ్చినట్లు.. ఐఆర్తో కలిపి పెన్షన్ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించి ప్రభుత్వం.. ఏజీ కార్యాలయానికి పంపకుండానే.. సీఎఫ్ఎమ్ఎస్ లో ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కొత్త బిల్లులు సిద్ధమయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం 4 లక్షలకు పైగా పింఛనుదార్లకు.. కొత్త స్కేళ్ల ప్రకారం జనవరి పెన్షన్ చెల్లించనున్నారు. 2018 జులై ముందు పదవీవిరమణ చేసిన వారితోపాటు ఆ తర్వాత పదవీవిరమణ చేసిన వారికీ కొత్త పెన్షన్ ఇవ్వనున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!