తెలంగాణ

telangana

ETV Bharat / city

'వామన్​రావు దంపతుల హత్య కేసును సీఐడీకి ఇవ్వండి' - telangana news

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీఐడీకి బదిలీ చేయాలని ఏపీ మాజీ సీఎస్​ ఎల్​వీ సుబ్రమణ్యం డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. లక్డీకపూల్​లోని డీజీపీ కార్యాలయాకి వెళ్లిన ఆయన...ఈ మేరకే వినతి పత్రాన్ని సమర్పించారు.

'వామన్​రావు దంపతుల హత్య కేసును సీఐడీకి ఇవ్వండి'
'వామన్​రావు దంపతుల హత్య కేసును సీఐడీకి ఇవ్వండి'

By

Published : Feb 18, 2021, 5:39 PM IST

న్యాయవాది దంపతుల హత్యకేసు విచారణలో పారదర్శకత కోసం కేసును సీఐడీకి బదిలీ చేయాలని.. ఇందుకోసం సీనియర్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేయాలని ఏపీ మాజీ సీఎస్ ఎల్​వీ సుబ్రమణ్యం డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. లక్డీకపూల్​లోని డీజీపీ కార్యాలయాకి వెళ్లిన ఆయన... వినతి పత్రాన్ని సమర్పించారు.

త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అభియోగ పత్రాలు దాఖలు చేసి ఫాస్ట్​ట్రాక్ కోర్టు ద్వారా ట్రయల్ చేసి నిందితులకు కఠిన శిక్ష అమలయ్యేలా చూడాలని కోరారు. భయబ్రాంతులకు గురైన లాయర్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కలిగించి ఆదుకోవాలని కోరారు.

ఇవీ చూడండి:'తెలంగాణ విద్యార్థులు వెనకపడొద్దనే ఈ నిర్ణయం'

ABOUT THE AUTHOR

...view details