తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజ్యశ్యామల యాగంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్​

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. పలు ఆలయాలను సందర్శించిన అనంతరం.. రాజ్యశ్యామల యాగంలో సీఎం పాల్గొన్నారు.

రాజ్యశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్​
రాజ్యశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్​

By

Published : Feb 17, 2021, 4:42 PM IST

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో ఏపీ సీఎం జగన్‌ పాల్గొన్నారు. అక్కడ ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్న సీఎం.. అనంతరం రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. వేదపండితులను జగన్‌ సత్కరించారు. ఆ తర్వాత శారదాపీఠం వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు.

రాజ్యశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్​

అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో ఉక్కు పరిరరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం

ఇదీ చదవండి:ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులకు ఏపీ సీఎం హామీ

ABOUT THE AUTHOR

...view details