కీసర లంచం కేసులో అరెస్టు అయిన నలుగురు నిందితులను కస్టడీకి అనుమతిస్తూ అనిశా కోర్టు తీర్పు వెల్లడించింది. మంగళవారం నుంచి 3 రోజులపాటు నాంపల్లి అనిశా కార్యాలయంలో మాజీ తహసీల్దార్ నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, శ్రీనాథ్, అంజిరెడ్డిని అధికారులు విచారించనున్నారు.
కీసర లంచం కేసు: 3 రోజుల అనిశా కస్టడీకి నిందితులు - కీసర లంచం కేసు
కీసర లంచం కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులను కస్టడీకి అనుమతిస్తూ అనిశా కోర్టు తీర్పు వెల్లడించింది. రేపటి నుంచి 3 రోజులపాటు నాంపల్లి అనిశా కార్యాలయంలో విచారణ సాగనుంది. రూ.కోటి 10 లక్షల లంచం వ్యవహారంపై మాజీ తహసీల్దార్ నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, శ్రీనాథ్, అంజిరెడ్డిని అధికారులు విచారించనున్నారు.
![కీసర లంచం కేసు: 3 రోజుల అనిశా కస్టడీకి నిందితులు anti corruption buro court vardit to give 4 accused to custody](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8537748-394-8537748-1598263719290.jpg)
కీసర లంచం కేసు: 3 రోజుల అనిశా కస్టడీకి నిందితులు
చంచల్గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను అనిశా కస్టడీలోకి తీసుకోనుంది. రూ.కోటి 10 లక్షల లంచం వ్యవహారంపై ఆరా తీయనుంది. తహసీల్దార్ నాగరాజు సమక్షంలో బ్యాంక్ లాకర్ను కూడా అనిశా అధికారులు తెరవనున్నారు.