తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Corona cases: ఏపీలో కొత్తగా 493 కరోనా కేసులు.. ఏడు మరణాలు - ఏడు మరణాలు

ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో 493 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 20,62,303 మంది వైరస్‌ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

AP Corona case
ఏపీలో కొత్తగా 493 కరోనా కేసులు

By

Published : Oct 21, 2021, 10:30 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,820 పరీక్షలు నిర్వహించగా.. 493 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 20,62,303 మంది వైరస్‌ బారినపడినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,327కి చేరింది. 24 గంటల వ్యవధిలో 552 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,42,476కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 5,500 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,91,42,162 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

ఏపీలో జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే అత్యధికంగా చిత్తూరులో 113, గుంటూరులో 74, తూర్పుగోదావరిలో 45, పశ్చిమగోదావరిలో 66, అనంతపురంలో 6, కడపలో 24, కృష్ణాలో 56, నెల్లూరులో 31, ప్రకాశంలో18, శ్రీకాకుళంలో 20, విశాఖలో 25, కర్నూలులో 8, విజయనగరంలో ఏడుగురికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:కడప: ఆదిరెడ్డిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details