తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 2,918 మందికి కరోనా​.. 24 మంది మృతి - ఏపీలో మరో 2,918 మందికి కరోనా పాజిటివ్​

ఆంధ్రప్రదేశ్​లో సోమవారం తాజాగా 2,918 మందికి కోవిడ్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 7,86,050కు చేరింది.

Another 2,918 were corona positive and 24 died in AP
ఏపీలో మరో 2,918 మందికి కరోనా పాజిటివ్​, 24 మంది మృతి

By

Published : Oct 19, 2020, 10:45 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం తాజాగా 2,918 మందికి కొవిడ్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలపి బాధితుల సంఖ్య 7,86,050కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో 24 మంది మృతి చెందారు. కాగా.. ఇప్పటి వరకు వైరస్ కారణంగా 6,453 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు 7,44,532 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం ఏపీలో 38,979 యాక్టివ్‌ కేసులున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 61,330 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు మెుత్తం 71.27 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.

జిల్లాల వారీగా కేసులు...

తూర్పుగోదావరి 468, పశ్చిమగోదావరి 447, చిత్తూరు 380, గుంటూరు 333, ప్రకాశం 308, అనంతపురం 218, కడప 155, శ్రీకాకుళం 143, విశాఖ 120, నెల్లూరు 119, కృష్ణా 117, కర్నూలు 66, విజయనగరం 44 కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు

కృష్ణా 4, గుంటూరు 4, విశాఖ 4, చిత్తూరు 4, కడప 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు 1, ప్రకాశం 1, పశ్చిమగోదావరి 1 చొప్పున ప్రాణాలు విడిచారు.

ఇదీ చదవండి:వరద బాధితులకు ప్రభుత్వం అండ.. రూ.550 కోట్లు విడుదల

ABOUT THE AUTHOR

...view details