హైదరాబాద్ సరూర్ నగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి... పెంపుడు కుక్కను ఎయిర్ గన్తో కాల్చాడు. ఆ శునకం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అరెస్టు
గన్తో కాల్చిన వ్యక్తి అవినాష్గా గుర్తించారు. బేగంపేటలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిసారి కుక్క ఇంట్లోకి వస్తుందన్న కోపంతో... ఎయిర్ గన్తో కాల్చినట్లు సమాచారం. కుక్క యజమాని రాజు ఇచ్చిన ఫిర్యాదుతో.. అవినాష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది బషీర్బాగ్లో రూ.18వేలకు ఎయిర్ గన్ కొనుగోలు చేసినట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
"కుక్క ఇంట్లోకి వస్తుందన్న కోపంతో.. గన్తో కాల్చాడు" ఇవీ చూడండి: మహిళతో సంబంధం... కొట్టి చంపిన ఆమె కుటుంబ సభ్యులు