Liquor bottles Were Destroyed : గత మూడేళ్లుగా వివిధ కేసులలో పట్టుబడిన అక్రమ మద్యం సీసాలను ఏపీలోని అనంతపురం 4వ పట్టణ పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు డీఎస్పీ వీర రాఘవరెడ్డి, సెబ్ అధికారి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీఐ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో భద్రపరిచిన మద్యం బాటిళ్లను బయటకు తీసి లెక్కించారు. మద్యం సీసాలను నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో రోడ్డు రోలర్ కింద తొక్కించారు. మూడేళ్ల కాలంలో పట్టుబడిన 72 కేసుల మద్యం సీసాలను రోడ్డురోలర్తో తొక్కించేశారు. దాదాపు 22 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని ధ్వంసం చేశారు.
22 లక్షల విలువైన మందుబాటిళ్లు.. రోడ్డు రోలర్తో తొక్కించారు..! - Liquor bottles Were Destroyed in AP
WINE: గత మూడేళ్లుగా వివిధ కేసులలో పట్టుబడిన దాదాపు 22 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని అనంతపురం 4 వ పట్టణ పోలీసులు ధ్వంసం చేశారు. 72 కేసుల మద్యం సీసాలను రోడ్డురోలర్తో తొక్కించేశారు.

Liquor bottles Were Destroyed
09:28 May 22
22 లక్షల విలువైన మందుబాటిళ్లు.. రోడ్డు రోలర్తో తొక్కించారు..!
22 లక్షల విలువైన మందుబాటిళ్లు.. రోడ్డు రోలర్తో తొక్కించారు.