వారం అనంతరం ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని తన ఇంటికి వచ్చిన ఆనందయ్యను అదుపులోకి తీసుకోవడానికి శుక్రవారం సాయంత్రం పోలీసులు రాగా స్థానికులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేసి అడ్డుకున్నారు. దీంతో శనివారం వేకువజామున వచ్చి కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ ( krishnapatnam port academy) అకాడమీకి భారీ బందోబస్తు మధ్య ఆనందయ్యను తరలించారు. ఎక్కడికీ వెళ్లనని బహిరంగంగా ప్రకటించినా.. భద్రత కోసం సురక్షిత ప్రాంతంలో ఉండాలని డీఎస్పీ హరినాథ్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఔషధం తయారుచేసి అందరికీ అందిస్తానని ఆనందయ్య చెప్పారు.
కృష్ణపట్నంలో అయిదుగురికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ (corona positive) వచ్చినట్లు స్థానిక పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. వీరందరూ ఆనందయ్య మందు పంపిణీలో భాగస్వాములని చెప్పారు.
'ఎందుకు నిర్బంధించారో చెప్పాలి'
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ వాస్తవ మరణాలను గుర్తించాలని, ఈ విషయాన్ని బీసీ కమిషన్ సీరియస్గా తీసుకుంటుందని జాతీయ బీసీ కమిషన్ ( National BC Commission) సభ్యుడు ఆచారి తలోజి అన్నారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పర్యటించారు. ఆనందయ్య ఇస్తున్న మందుతో చాలామందికి ఆరోగ్యం మెరుగైందన్నారు. ఆనందయ్యను పదేపదే ఇబ్బందులు పెడుతుంటేనే.. హైకోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు.