తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటలను కలిసిన అమెరికా అంకాలజీ నెట్​వర్క్​ బృందం

అమెరికా అంకాలజీ నెట్​వర్క్​ ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్​, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​, సీఎస్​ ఎస్కే జోషిలను కలిశారు. హైదరాబాద్​లో​ ప్రపంచ స్థాయి క్యాన్సర్​ ఆస్పత్రి ఏర్పాటు కోసం పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ఈటల తెలిపారు.

By

Published : Nov 20, 2019, 10:11 PM IST

ఈటలను కలిసిన అమెరికా అంకాలజీ నెట్​వర్క్​ బృందం

హైదరాబాద్​లో ప్రపంచస్థాయి క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అమెరికా అంకాలజీ నెట్ వర్క్ ప్రతినిధుల బృందం ఇవాళ హైదరాబాద్​లో మంత్రి ఈటల, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సీఎస్ ఎస్కేజోషిలను కలిసింది. అమెరికాలో ఈ నెట్ వర్క్​కు 140 కేంద్రాలు, 265 మంది వైద్యులు ఉన్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన వినోద్ కుమార్ ఆహ్వానం మేరకు వైద్యుల బృందం హైదరాబాద్​కు వచ్చింది. ఇప్పటికే దిల్లీ, అమృత్ సర్ లలోనూ బృందం పర్యటించింది.

ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు ఆలోచనలో నెట్ వర్క్ ఉండగా... అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి ఈటల, వినోద్ చెప్పారు. నిమ్స్ ఆసుపత్రిలోని అంకాలజీ విభాగాన్ని కూడా అమెరికా బృందం సందర్శించింది. క్యాన్సర్ రోగ నిర్ధరణ, నివారణకు అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో... ఔట్ పేషంట్స్​గా చికిత్స చేసే విధానం అందుబాటులోకి రానుందని అమెరికా వైద్యులు తెలిపారు.

ఈటలను కలిసిన అమెరికా అంకాలజీ నెట్​వర్క్​ బృందం

ఇవీ చూడండి: పెట్టుబడుల్లో సింగపూర్ మాకు ఆదర్శం

ABOUT THE AUTHOR

...view details