ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు ఆతిథ్యం బాగుందని ముఖ్యమంత్రి కేసీఆర్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందించారు. రాష్ట్రపతిభవన్లో మంగళవారం రాత్రి నిర్వహించిన విందు సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జీఈఎస్లో కేసీఆర్ ఆతిథ్యానికి ట్రంప్ ఫిదా - america president dobaldo trump appreciate kcr
రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం ఇచ్చిన విందు సందర్భంగా కేసీఆర్, ట్రంప్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. 2018లో నిర్వహించిన జీఈఎస్ సదస్సు ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది.
![జీఈఎస్లో కేసీఆర్ ఆతిథ్యానికి ట్రంప్ ఫిదా america president dobaldo trump appreciate telangan cm chandra shekar rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6204966-thumbnail-3x2-kcr.jpg)
కేసీఆర్ ఆతిథ్యాన్ని మెచ్చుకున్న ట్రంప్
కేసీఆర్తో కరచాలనం చేసి జీఈఎస్ గురించి ప్రస్తావించారు. సదస్సుకు మీరు హాజరవుతారని భావించామని ట్రంప్తో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. సదస్సుకు రావాలని తాను ప్రయత్నించినా సాధ్యం కాలేదని అగ్రరాజ్య అధినేత సమాధానమిచ్చినట్లు సమాచారం.
ఇదీ చూడండి:ట్రంప్ పర్యటనపై విదేశీ మీడియా ఏమందంటే..
Last Updated : Feb 27, 2020, 10:24 AM IST