తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2020, 2:26 PM IST

ETV Bharat / city

హోరెత్తిన అమరావతి రైతుల నిరసన.. దద్దరిల్లిన మందడం శిబిరం

ఉద్యమ నినాదాలతో ఏపీలోని మందడం శిబిరం దద్దరిల్లింది. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో జై అమరావతి అంటూ నినదించారు. రైతులు, మహిళలు బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

amaravathi-farmers-protest-at-mandhadam
హోరెత్తిన అమరావతి రైతుల నిరసన.. దద్దరిల్లిన మందడం శిబిరం

ఆంధ్రప్రదేశ్​లోని అమరావతిలో రైతులు, మహిళలు ఆందోళన ఉద్ధృతం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ మార్గంలో వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ గోడు వినిపించేలా 'జై అమరావతి' అంటూ నినదించారు. పెద్ద ఎత్తున నినాదాలతో మందడం శిబిరం దద్దరిల్లింది.

నిరసనకారులు రోడ్డుపైకి రాకుండా పోలీసులు నిలువరించారు. రైతులు, మహిళలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రైతులు రెండు చేతులు పైకెత్తి దండాలు పెట్టారు.

ఇదీ చదవండి:కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం

ABOUT THE AUTHOR

...view details