హైదరాబాద్ విద్యానగర్లోని ఈయూ కార్యాలయంలో అఖిలపక్షం, ఆర్టీసీ ఐకాస నేతలు భేటీ అయ్యారు. కార్యక్రమానికి ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి హాజరయ్యారు. తెజస అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ నేతలు పల్లా వెంకట్రెడ్డి, సుధాకర్, కాంగ్రెస్ నుంచి వీహెచ్, భాజపా నుంచి మోహన్రెడ్డి హాజరు కాగా... తెదేపా తరఫున నేతలు ఎల్ రమణ, రావుల హాజరయ్యారు. సమావేశంలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అదేవిధంగా వాయిదా పడిన యూనియన్ నేతల నిరాహారదీక్షపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈయూ కార్యాలయంలో అఖిలపక్షం, ఆర్టీసీ ఐకాస నేతల భేటీ
ఈయూ కార్యాలయంలో అఖిలపక్షం, ఆర్టీసీ ఐకాస నేతల భేటీ
16:39 November 14
ఈయూ కార్యాలయంలో అఖిలపక్షం, ఆర్టీసీ ఐకాస నేతల భేటీ
Last Updated : Nov 14, 2019, 8:28 PM IST
TAGGED:
tsrtc strike latest news