తెలంగాణ

telangana

ETV Bharat / city

'పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణకు నష్టం' - telangana news

ఏపీలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. తమ ప్రాంతానికి న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర జలశక్తి సంయుక్త కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందజేశారు.

AICC Secretary Sampath Kumar on Potireddipadu lift irrigation project
పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణకు నష్టం

By

Published : Dec 18, 2020, 7:42 PM IST

పోతిరెడ్డిపాడుపై తెరాస, వైకాపా మధ్య చీకటి ఒప్పందం ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుందని అన్నారు.

ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సంపత్ మండిపడ్డారు. ప్రాజెక్టుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తికి సంయుక్త కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందజేశారు.

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణకు నష్టం

ABOUT THE AUTHOR

...view details