Army womens: ఏడుగురు మహిళా ఆర్మీ అధికారులు సాహస యాత్రకు పూనుకున్నారు. ఇండియన్ ఆర్మీ చరిత్రలో ఈ తరహాలో మహిళా అధికారులు ఇలా నౌకపై యాత్ర చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 44 అడుగుల పొడవైన బవరియా తరగతి నౌకలో ఈ యాత్రను చేపట్టారు. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యాత్రను చేపట్టారు. ఈ యాత్ర బృందానికి మజ్ముక్త సారథ్యం వహించారు.
తొలిసారి ఆర్మీ మహిళా అధికారుల సాహస ప్రయాణం.. - విశాఖలో ఆర్మీ అధికారుల నౌకా యాత్ర
army womens: ఆర్మీ మహిళా అధికారులు నౌకా యాత్రకు సాహసించారు. ఆర్మీ చరిత్రలోనే తొలిసారిగా మహిళా అధికారులు ఈ యాత్ర చేపట్టారు. చెన్నైలో ప్రారంభమైన వీరి యాత్ర ఏపీలోని విశాఖకు చేరుకుంది.
![తొలిసారి ఆర్మీ మహిళా అధికారుల సాహస ప్రయాణం.. adventure-boat-trip-of-army-women-officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14499838-73-14499838-1645161560352.jpg)
adventure-boat-trip-of-army-women-officers
చెన్నైలో బయలుదేరి 54 గంటల సాహసోపేతమైన ప్రయాణం తర్వాత 330 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న విశాఖకు చేరుకున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా మహిళా ఆర్మీ అధికారులు చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావడం.. పీఎఫ్ఆర్, మిలన్-2022 జరుగుతున్న తరుణంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి: