తెలంగాణ

telangana

ఉద్రిక్తతంగా మారిన సీపీ కార్యాలయ ముట్టడి...

యువతి అత్యాచార కేసులో నిందితులను అరెస్టు చేయాలంటూ ఏబీవీపీ నాయకులు తలపెట్టిన సీపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

By

Published : Aug 26, 2020, 1:10 PM IST

Published : Aug 26, 2020, 1:10 PM IST

abvp leaders  Siege cp office
abvp leaders Siege cp office

యువతిని అత్యాచారం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్​ చేయాలంటూ ఏబీవీపీ చేపట్టిన సీపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ముట్టడిని అడ్డుకునేందుకు ముందస్తుగా బషీర్​బాగ్​లోని సీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసుల కళ్లు గప్పి ఆటోలో వచ్చిన ఏబీవీపీ నాయకులు సీపీ కార్యాలయం లోపలికి చొచ్చుకపోవడానికి యత్నించారు.

వారిని అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేయగా... పోలీసులకు ఏబీవిపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొంతమంది నాయకులకు స్వల్పగాయాలయ్యాయి. అమ్మాయిని అత్యాచారం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ నాయకులు డిమాండ్​ చేశారు. బాధితురాలికి రక్షణ కల్పించి... ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపాలన్నారు. తెరవెనుక ఉన్న కీచకులందరినీ కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నాయకులు మండిపడ్డారు.

ఇదీ చూడండి:'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

ABOUT THE AUTHOR

...view details