హైదరాబాద్ మహా నగరంలో వార్డుల వారీగా చేపట్టనున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమ నిర్వహణపై.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో మేయర్ సమావేశం నిర్వహించారు. నగరంలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు మూడు రోజులపాటు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వార్డుల్లో ప్రధాన రహదారులన్నింటిని పూర్తిస్థాయిలో శుభ్రం చేయడంతో పాటు రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చివేస్తారు. వార్డులో ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను, ఖాళీ స్థలాలు, రహదారుల వెంట ఉన్న పిచ్చి మొక్కలన్నింటిని తొలగిస్తారు.
వార్డులవారిగా శానిటేషన్ ...
నగరంలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు మూడు రోజులపాటు విస్తృత శానిటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మేయర్ తెలిపారు. హోటళ్లు, ఫుడ్ వెండర్లు, ఫుట్పాత్లపై ఆహారాన్ని తయారుచేసే అన్ని రకాల హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో శుభ్రత పాటింపుపై తనిఖీలు నిర్వహించనున్నారు. ఎంటమాలజి విభాగం ద్వారా ఫాగింగ్, లార్వా నివారణ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నారు. వీధి కుక్కల బెడదకు సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించనున్నారు.