తెలంగాణ

telangana

ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో ఓ యువకుడు అదృశ్యం

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. స్నేహితులతో కలిసి తిరుపతి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన.. సంతోష్​ ఆచూకీ లభించటం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

By

Published : Nov 6, 2019, 10:48 AM IST

Published : Nov 6, 2019, 10:48 AM IST

ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో ఓ యువకుడు అదృశ్యం

స్నేహితులతో కలిసి తిరుపతి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన.. ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. కొర్రెముల గ్రామానికి చెందిన రాధరామ్‌ బాలనర్సింహ్మ కొడుకు సంతోష్‌... గత నెల 27న తిరుపతి వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి బయలుదేరాడు. వారం రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడం వల్ల తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. గత నెల 30నుంచి చరవాణి కూడా పనిచేయటం లేదని పోలీసులకు తెలిపాడు. దీనిపై అదృశ్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో ఓ యువకుడు అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details