తెలంగాణ

telangana

ETV Bharat / city

హుండీ లెక్కింపులో చేతివాటం.. డిప్యూటీ కమిషనర్​ హస్తముందా.? - రామతీర్థం నేటి వార్తలు

ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయ హుండీ లెక్కింపులో ఓ వ్యక్తి చేతివాటం ప్రదర్శించారు. అతని నుంచి రూ.3 వేలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా డిప్యూటీ కమిషనర్ సుజాత ప్రమేయంపైనా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

theft in hundi counting
హుండీ లెక్కింపులో చేతివాటం.. డిప్యూటీ కమిషనర్​ హస్తముందా.?

By

Published : Mar 17, 2021, 7:31 PM IST

ఏపీలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం రామాలయం హుండీ లెక్కింపులో... దేవాదాయశాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ సుజాత వాహన డ్రైవర్ నరేశ్​ చేతివాటం ప్రదర్శించాడు. హుండీ లెక్కింపు సందర్భంగా అతను అనుమానాస్పదంగా వ్యవహరించటంతో ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుడిలోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నరేశ్ చేతివాటం ప్రదర్శించినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.3 వేల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో దేవాదాయశాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ సుజాత ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి:సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీపై ఈసీ అభ్యంతరం

ABOUT THE AUTHOR

...view details