తెలంగాణ

telangana

'తన భూమి ఆక్రమించి బెదిరిస్తున్నారు'

By

Published : Feb 26, 2020, 11:54 AM IST

అన భూమి ఆక్రమించి తనను బెదిరిస్తున్నారని అమీర్​పేటకు చెందిన మహేష్ అగర్వాల్​ ఎస్​ఆర్​ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. అధికార పార్టీ నేతలే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

a man complaint in sr nagar police station for protection from land grabbers
'తన భూమి ఆక్రమించి బెదిరిస్తున్నారు'

తన స్థలాన్ని ఆక్రమించి తనను మానసికంగా వేదిస్తున్నారని మహేష్ అగర్వాల్​ అనే వ్యక్తి ఎస్​ఆర్​ నగర్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. అమీర్​పేటకు చెందిన మహేష్​ అగర్వాల్​కు ఎస్​ఆర్​ నగర్​లో మూడు కోట్ల విలువైన 250 గజాల స్థలం ఉంది. దానిని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరు నెలల నుంచి తనను అధికార పార్టీ నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసులకు, పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు అగర్వాల్ తెలిపారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

'తన భూమి ఆక్రమించి బెదిరిస్తున్నారు'

ఇవీ చూడండి:'ఆరు నెలల్లోపు పట్టణ ప్రగతి కనిపించాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details