తెలంగాణ

telangana

ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుల పంపిణీపై పిటిషన్

By

Published : May 24, 2021, 7:49 PM IST

ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుల పంపిణీపై ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషన్​లో తెలిపారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్​పై హైకోర్టు నుంచి ఇంకా అనుమతి రాలేదు.

anand
anand

ఏపీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుల పంపిణీపై అనంతపురం జిల్లాకు చెందిన మాదినేని ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణపట్నంలో కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు.

మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసిందన్నారు. ఫలితంగా అనేకమంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. హౌస్ మోషన్ పిటిషన్​పై ఇంకా హైకోర్టు నుంచి అనుమతి రాలేదు.

ABOUT THE AUTHOR

...view details