తెలంగాణ

telangana

AP corona cases: ఏపీలో కొత్తగా 840 కరోనా కేసులు.. ఒకరు మృతి

By

Published : Jan 7, 2022, 4:46 PM IST

AP corona cases: ఏపీలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 840 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు.

AP corona cases, covid news in ap
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు

AP corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 840 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. విశాఖ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. తాజాగా.. మరో 133 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 37,849 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2,972 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు

సునామిలా కరోనా

India covid cases: మరోవైపు భారత్​లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో కరోనా.. సునామిలా దూసుకుపోతుంది. రోజు వ్యవధిలోనే రెట్టింపు వేగంతో కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే.. 1,17,100 మందికి వైరస్​ సోకింది. గతేడాది జూన్​ 7 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వైరస్​ ధాటికి మరో 302 మంది చనిపోయారు. 30,836 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 7.74 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఒమిక్రాన్ పంజా

Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,007డు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 1,199 మంది కోలుకున్నట్లు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత దిల్లీలో 465 మందికి కొత్త వేరియంట్​ సోకింది.


ఇదీ చదవండి:High Court about Corona : పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details