తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 4,228 కొవిడ్ కేసులు, 10 మరణాలు - కొవిడ్ విజృంభణ తాజా వార్తలు

ఏపీలో కొత్తగా 4,228 కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో 1,483 బాధితులు కోలుకోగా.. 10 మరణాలు సంభవించినట్లు వెల్లడించారు.

ఏపీలో కొత్తగా 4,228 కొవిడ్ కేసులు, 10 మరణాలు
ఏపీలో కొత్తగా 4,228 కొవిడ్ కేసులు, 10 మరణాలు

By

Published : Apr 13, 2021, 8:33 PM IST

ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు అధికారులు వివరించారు. కొవిడ్ బారి నుంచి మరో 1,483 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 25 వేల 850 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నట్లు వివరించారు.

ఏపీలో కొత్తగా 4,228 కొవిడ్ కేసులు, 10 మరణాలు

ఇదీ చూడండి:ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details