తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులకు తీవ్రగాయాలు

ఏపీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా తోటచెర్ల జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో మధిరకు చెందిన ఇధ్దరు, కోదాడకు చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

By

Published : Sep 24, 2020, 12:09 PM IST

ఏపీలో రోడ్డు ప్రమాదం.. నలుగురు  తెలంగాణ వాసులకు తీవ్రగాయాలు
ఏపీలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులకు తీవ్రగాయాలు

ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల వద్ద.. జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామానికి చెందిన ఇద్దరు.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details