Telangana News Today : దేశవ్యాప్తంగా 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో కొత్తగా 14.5 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే సమయంలో 39,652 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్లో 79,283 హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. అత్యధికంగా మహారాష్ట్రలో 4,80,094 హెక్టార్ల భూమి ఎడారీకరణ/క్షీణతకు గురై ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. 2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 17వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డీగ్రెడేషన్ అట్లాస్’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఎడారీకరణ/భూక్షీణతకు నీటికోత, అటవీసంపద తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
2018-19 నాటికి..
Telangana Lands : దేశవ్యాప్తంగా 2018-19 నాటికి మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77%) భూమి క్షీణతకు గురైంది. తెలంగాణ రాష్ట్ర మొత్తం భూభాగం 1,14,84,000 హెక్టార్లు కాగా.. అందులో 36,38,508 హెక్టార్లు (31.68%) ఎడారీకరణకు గురైంది. ఆంధ్రప్రదేశ్లో 14.84% భూమి క్షీణతకు గురైంది. ఇప్పటివరకు అత్యధిక క్షీణతకు గురైన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వరుస స్థానాలను ఆక్రమించాయి.
2003-05 నుంచి 2011-13 మధ్య కొంత మెరుగు