తెలంగాణ

telangana

ETV Bharat / city

Voter List Telangana: 3.03 కోట్ల ఓటర్లు - 3 crores 3 lakhs of Voters

Voter List Telangana: రాష్ట్రంలో సగానికి పైగా నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటె మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఆరు లక్షలా 64 వేల మందితో.. ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గంగా శేరిలింగంపల్లి నిలిచింది. అతి తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో కేవలం లక్షా 41వేల మంది ఓటర్లున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే మూడో వంతు ఓటర్లున్నారు.

3 crores 3 lakhs of Voters in  Telangana as  voters list of 2022
3 crores 3 lakhs of Voters in Telangana as voters list of 2022

By

Published : Jan 6, 2022, 5:14 AM IST

Voter List Telangana: కొత్త ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం మూడు కోట్లా మూడు లక్షలా 56 వేలా 894 మంది ఓటర్లున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య లక్ష నుంచి రెండు లక్షల మధ్య ఉంది. 90 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య రెండు నుంచి మూడు లక్షల మధ్య ఉంది. మూడు నుంచి నాలుగు లక్షల మధ్య తొమ్మిది నియోజకవర్గాల్లో... నాలుగు నుంచి ఐదు లక్షల మధ్య మూడు నియోజకవర్గాల్లో ఓటర్లున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో ఐదు నుంచి ఆరు లక్షల మధ్య ఓటర్లు ఉండగా... రెండు నియోజకవర్గాల్లో మాత్రం ఓటర్ల సంఖ్య ఆరు లక్షల మార్కును దాటింది.

అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6 లక్షలా 64 వేలా 120 మంది ఓటర్లున్నారు. 6 లక్షలా 29వేలా 619 మంది ఓటర్లతో కుత్బుల్లాపూర్ రెండో స్థానంలో ఉంది. 5,68,678 మంది ఓటర్లతో మేడ్చల్... 5,57,081 మంది ఓటర్లతో ఎల్బీనగర్... 5,06,646 మంది ఓటర్లతో ఉప్పల్... 5,02,796 మంది ఓటర్లతో రాజేంద్రనగర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహేశ్వరం, మల్కాజిగిరి, కూకట్​పల్లి నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య నాలుగు లక్షలకు పైగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లాలో 43 లక్షలకు పైగా ఓటర్లున్నారు. రంగారెడ్డిలో 31 లక్షలకుపైగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 26 లక్షలకు పైగా ఓటర్లున్నారు. ఈ మూడు జిల్లాలు కలిపితే ఓటర్లసంఖ్య ఒక కోటికి పైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్లా మూడు లక్షలకు పైగా ఓటర్లు ఉండగా... ఈ మూడు జిల్లాల్లోనే మూడో వంతు ఉండడం విశేషం. అతి తక్కువ సంఖ్యలో ములుగు జిల్లాలో కేవలం రెండు లక్షలా 11 మంది ఓటర్లున్నారు. వనపర్తిలో 2,46,297 మంది, భూపాలపల్లిలో 2,61,184 మంది ఓటర్లున్నారు.

మరోవైపు రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటె మహిళల సంఖ్యే అధికంగా ఉంది. 119 నియోజకవర్గాలకు గాను 63 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. రాజధాని హైదరాబాద్​తో పాటు రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లోని ఒక్క నియోజకవర్గం కూడా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న జాబితాలో లేవు. 18 ఏళ్లు నిండిన మొదటి సారి ఓటు హక్కు పొందిన వారు ఒక లక్షా 36 వేలా 496 మంది ఉన్నారు. హైదరాబాద్​లో అత్యధికంగా 13,025 మంది తొలిసారి ఓటుహక్కు పొందారు. నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో తొమ్మిది వేల పై చిలుకు మంది కొత్త ఓటర్లున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details