సాధారణంగా ఒక కాన్పులో ఒక్కరు లేదా ఇద్దరు పుడుతుంటారు. కానీ.. ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఆటోనగర్కు చెందిన భవ్య భాను.. పురిటి నొప్పులతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు.. సాధారణ కాన్పు చేశారు.
3 babies born: ఒకే కాన్పులో ముగ్గురి జననం.. ఒకరి పరిస్థితి ఆందోళనకరం! - హిందుపురం తాజా వార్తలు
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించిన ఘటన.. ఏపీలోని అనంతపురం జిల్లా హిందుపురంలో జరిగింది. ఓ శిశువు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న కారణంగా... హిందుపురం ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

ఒకే కాన్పులో ముగ్గురి జననం.. ఒకరి పరిస్థితి ఆందోళనకరం!
భవ్య భాను.. ఇద్దరు ఆడపిల్లలు.. ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉండగా.. మరో చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ శిశువును హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. చికిత్స కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి:హైదరాబాద్లో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ.. ఐటీఈ సహకారం