తెలంగాణ

telangana

By

Published : Jun 21, 2021, 7:55 PM IST

ETV Bharat / city

Ap Corona: ఏపీలో కరోనా తగ్గుముఖం... కొత్తగా 2,620 మందికి పాజిటివ్

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 24 గంటల్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,620 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

corona cases
ఏపీ కరోనా

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,620 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 7,504 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 17,82,680కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 58,140 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనాతో పోరాడుతూ తాజాగా 44 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12,363 మందికి చేరింది. చిత్తూరులో అత్యధికంగా 10 మంది మృతి చెందగా, గుంటూరు 5, శ్రీకాకుళం 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 3, కర్నూలు 3, ప్రకాశం 3, విశాఖపట్నం 3, పశ్చిమగోదావరి 3, కృష్ణా 2, కడప 1, నెల్లూరు 1, విజయనగరం ఒకరు కన్నుమూశారు.

ఏపీ కరోనా కేసులు

ఇదీ చదవండి:CM KCR:వరంగల్‌ గ్రామీణ, అర్బన్‌ జిల్లాలకు కొత్త పేర్లు

ABOUT THE AUTHOR

...view details