ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,620 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 7,504 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 17,82,680కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 58,140 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Ap Corona: ఏపీలో కరోనా తగ్గుముఖం... కొత్తగా 2,620 మందికి పాజిటివ్ - ఏపీ కొవిడ్ తాజా సమాచారం
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 24 గంటల్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,620 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

ఏపీ కరోనా
కరోనాతో పోరాడుతూ తాజాగా 44 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12,363 మందికి చేరింది. చిత్తూరులో అత్యధికంగా 10 మంది మృతి చెందగా, గుంటూరు 5, శ్రీకాకుళం 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 3, కర్నూలు 3, ప్రకాశం 3, విశాఖపట్నం 3, పశ్చిమగోదావరి 3, కృష్ణా 2, కడప 1, నెల్లూరు 1, విజయనగరం ఒకరు కన్నుమూశారు.
ఇదీ చదవండి:CM KCR:వరంగల్ గ్రామీణ, అర్బన్ జిల్లాలకు కొత్త పేర్లు