తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2021, 11:19 PM IST

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 197 కరోనా కేసులు, రెండు మరణాలు

ఏపీలో కొత్తగా 197 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,85,234కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్​లో పేర్కొంది.

197new-corona-cases-and-two-deaths-registered-in-the-state in ap
ఏపీలో కొత్తగా 197 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 40,986 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 197 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,85,234కు చేరింది. వైరస్ బారిన పడి తాజాగా ఇద్దరు చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 7,133కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

ఏపీలో కొత్తగా 197 కరోనా కేసులు

తాజాగా 234 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,75,000కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,411 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కోటీ 24 లక్షల శాంపిల్స్‌ని పరీక్షించినట్లు బులెటిన్​లో వెల్లడించింది.

ఇదీ చదవండి:300కి పైగా విద్యార్థులు ఉంటే షిప్టు విధానం.. విద్యా శాఖ మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details