తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రత్యేక విమానంలో యూకేకు 136 మంది - ప్రత్యేక విమానంలో యూకేకు 136 మంది

లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన విదేశీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి పంపుతున్నారు. నేడు 136 మంది యూకే వాసులను బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ప్రత్యేక విమానంలో లండన్‌కు పంపారు. పూర్తి పరీక్షల అనంతరం వీరందరిని స్వదేశానికి పంపారు.

136 members of uk people sent to landon
ప్రత్యేక విమానంలో యూకేకు 136 మంది

By

Published : Apr 17, 2020, 8:50 PM IST

హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 136 మంది యూకే వాసులు ఇవాళ ప్రత్యేక విమానం స్వదేశానికి తీసుకెళ్లారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ప్రత్యేక విమానం.. ఇవాళ సాయంత్రం 6.46 గంటలకు 136 మందిని ఎక్కించుకుని అహ్మదాబాద్‌ వెళ్లింది. అక్కడ మరికొందరిని ఎక్కించుకొని బహ్రెయిన్‌కు వెళ్తుంది. అక్కడ ఉన్న మరికొందరితో లండన్‌కు వెళ్లనుంది.

ఎయిర్‌ కార్గో అధికారులు.. దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగువేల మందికిపైగా బ్రిటిష్ పర్యాటకులను స్వదేశానికి పంపడం సంతోషంగా ఉందన్నారు. ప్రయాణానికి ముందే 136 మందికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు.

ప్రయాణీకులు ధర్మల్‌ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న విమానాశ్రయ సిబ్బంది

ఇదీ చదవండి:ఏపీకి వచ్చిన లక్ష కరోనా ర్యాపిడ్​ టెస్ట్​ కిట్లు

ABOUT THE AUTHOR

...view details